ఇప్పుడు తెలుగులో వస్తున్న లఘు కవితా రూపాల్ని గురించి ఆలోచించినప్పుడు లక్ష్మణ్ రావ్ అక్షర నియమంతో హైకూలు రాయటం విశిష్ట కృషిగానే కనిపిస్తుంది అదీ సహజంగా రావటం అభినందనీయం . ఇక హైకూల్లో ఎలాంటి విషయాలు చెప్పాలనే అంశం గురించి కూడా తేడాలున్నాయి . లక్ష్మణ్ రావ్ అన్ని విషయాలు హైకూల్లో చెప్పాడు. కవిని ఎవరూ శాసించలేరు .ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. లక్ష్మణ్ రావ్ కు కవిగా, సాహిత్య విమర్శకుడిగా మంచి భవిష్యత్తు ఉంది. అని ఱవి రంగారావు గారు తన ముందు మాటలో చెప్పారు